ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మద్యానికి బానిసై.. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

By

Published : Sep 24, 2020, 12:05 AM IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన అనంతపురంలో జరిగింది.

a man died body found in a railway track in ananthapur district
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య !

ఆదోనికి చెందిన శేఖర్ అనంతపురంలోని బంధువుల ఇంటికి పచ్చాడు. అయితే రైలు ఢీకొని మృతి చెందాడు. పట్టాలపై పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. మృతుని బంధువులకు సమాచారం ఇచ్చారు. వ్యాపారం నిమిత్తం కర్నూలు జిల్లా ఆదోనిలో స్థిరపడ్డాడని.. లాక్​డౌన్ కారణంగా వ్యాపారం సాగక మనస్థాపం చెందిన శేఖర్​.. మద్యానికి బానిస అయ్యాడని మృతుని బంధువులు తెలిపారు. తరచూ ఇంట్లో గొడవ పడేవాడని... మద్యం మత్తులోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details