ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

కిరాణా దుకాణమే క్రికెట్ బెట్టింగ్ స్థావరం.. బూకీతో పాటు 9 మంది అరెస్ట్ - బూకీతో పాటు 9 మంది అరెస్ట్

ఓ కిరాణా దుకాణాన్ని క్రికెట్ బెట్టింగ్​కి అడ్డగా చేసుకున్న ముఠాను గిద్దలూరు పోలీసులు పటాపంచలు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బెట్టింగ్ బూకీతో పాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

క్రికెట్ బెట్టింగ్ బూకీితో పాటు 9 మంది అరెస్ట్ : గిద్దలూరు సీఐ
క్రికెట్ బెట్టింగ్ బూకీితో పాటు 9 మంది అరెస్ట్ : గిద్దలూరు సీఐ

By

Published : Oct 9, 2020, 8:53 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్లలోని ఓ కిరాణా దుకాణం క్రికెట్ బెట్టింగ్ కేంద్రంగా మారింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. బెట్టింగ్ కేంద్రంపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న బూకీతో పాటు, బెట్టింగ్ ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

9 ఫోన్లు, నగదు స్వాధీనం..

అనంతరం నిందితుల నుంచి 9 సెల్ ఫోన్లు, రూ.10,000 నగదును స్వాధీనం చేసుకున్నామని రాచర్ల సబ్ ఇన్​స్పెక్టర్​ త్యాగరాజు తెలిపారు. ఫోన్ పే ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు పేర్కొన్నారు. నిందితులందరి అకౌంట్లను సీజ్ చేస్తామని సీఐ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి :

సైబర్ కేటుగాళ్లు.. పోలీసులకే కుచ్చుటోపీలు

ABOUT THE AUTHOR

...view details