కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అటవీప్రాంతంలో పోలీసులు భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 3 కోట్ల విలువగల 94 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, రక్షకభటుల సాయంతో జ్యోతి క్షేత్రం చెలిమ బావి వద్ద దాడులు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్ చేశామని డీఎఫ్వో గురుప్రభాకర్ వెల్లడించారు. ఈ దోపిడీలో అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తముందని అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
భారీగా ఎర్రచందనం పట్టివేత.. తరలింపులో అంతర్జాతీయ స్మగ్లర్లు! - ఎర్రచందనం పట్టివేత: దుంగల విలువ సుమారు3 కోట్ల పైమాటే..!
కడప జిల్లా పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధం చేసిన లారీని స్వాధీనం చేసుకున్నారు.
![భారీగా ఎర్రచందనం పట్టివేత.. తరలింపులో అంతర్జాతీయ స్మగ్లర్లు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4016384-321-4016384-1564722266939.jpg)
దుంగల విలువ సుమారు 2 కోట్ల పైమాటే..!
Last Updated : Aug 2, 2019, 1:25 PM IST
TAGGED:
ap crime