ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

అన్నమయ్య జిల్లాలో దారుణం.. పట్టపగలే మాజీ సర్పంచ్​ దారుణహత్య - మాజీ సర్పంచ్​ దారుణహత్య

EX SARPANCH MURDER IN ANNAMAYYA : పట్టపగలే మాజీ సర్పంచ్​ దారుణ హత్యకు గురైన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.

EX SARPANCH MURDER
EX SARPANCH MURDER

By

Published : Oct 15, 2022, 6:13 PM IST

అన్నమయ్య జిల్లాలో దారుణం.. పట్టపగలే మాజీ సర్పంచ్​ దారుణహత్య

YSRCP EX SARPANCH MURDER : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శాంతినగర్‌కు చెందిన వైకాపా నాయకుడు మైసూరువారిపల్లి మాజీ సర్పంచ్ మోహన్‌ను ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మోహన్‌ మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details