ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

హైకోర్టులో ఉద్యోగం పేరుతో వసూళ్లు.. మహిళ అరెస్ట్ - హైకోర్టులో ఉద్యోగాలు పేరుతో మోసం

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన మహిళను గవర్నర్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. 1 లక్ష 80 వేల రూపాయలు తీసుకుని.. ఆపై బెదిరింపులకు పాల్పడుతుండంటంతో సదరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో మహిళను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Woman arrested for cheating
మహిళ అరెస్ట్

By

Published : Jul 17, 2021, 10:46 AM IST

హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ముగ్గురు మహిళల నుంచి 1 లక్ష 80 వేల రూపాయలు వసూలు చేసిన మహిళపై విజయవాడలోని గవర్నర్​పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పాయకాపురంలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన సరోజిని భర్త మరణించడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి గవర్నర్​పేటలోని పెద్దిబొట్లవారివీధిలో టైలరింగ్ దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.

తన వద్దకు వచ్చే కస్టమర్లతో మాట కలిపి.. తనకు హైకోర్టులో జడ్జి తెలుసని మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికించింది. రూ.60 వేలు కడితే ఉద్యోగం వస్తుందని నమ్మకంగా చెప్పగా.. గత సంవత్సరం సెప్టెంబరులో డబ్బులు కట్టారు. ఎన్నిసార్లు ఉద్యోగం గురించి అడిగినా దాటవేస్తూ వచ్చింది. పైగా డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఉద్యోగాలంటూ ఇబ్బంది పెడితే చంపిస్తానని స్వర్ణకుమారి బెదిరిస్తోందని బాధితులు వాపోయారు. మోసపోయామని గమనించి చివరికి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వర్ణకుమారిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచారు.

ABOUT THE AUTHOR

...view details