ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 10, 2021, 5:06 PM IST

ETV Bharat / crime

Accident at Chillakallu: ట్రాక్టర్- బైకు ఢీ.. ఇద్దరు మృతి

కృష్ణా జిల్లా చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న మొక్కలకు నీరు కొట్టే ట్రాక్టర్​ను ద్విచక్రవాహనం ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

accident at chillakall in Krishna district
కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద రోడ్డు ప్రమాదం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై చిల్లకల్లు వైపు వెళ్తూ.. మొక్కలకు వాటర్ కొట్టే ట్రాక్టర్​ను ఢీ కొట్టారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు ఆదే గ్రామానికి చెందిన వాళ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details