ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

లాడ్జిలో ఇద్దరి ఆత్మహత్య.. అసలు కారణమేంటో..? - two people committed suicide at renigunta

చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు.. వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

two people committed suicide at renigunta lodge in different room
రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు ఆత్మహత్య

By

Published : Mar 16, 2021, 7:04 PM IST

Updated : Mar 16, 2021, 7:37 PM IST

చిత్తూరు జిల్లా రేణిగుంటలోని లాడ్జిలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేర్వేరు గదుల్లో వెంకటేష్(35), అనిత(31) బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే రెండు రోజుల క్రితం వారు వేర్వేరుగా గదులు తీసుకున్నారు. పురుగుల మందు తాగి వెంకటేశ్​ ఆత్మహత్య చేసుకోగా.. అనిత ఉరివేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట పోలీసులు.. మృతికి గల కారణాలు అన్వేషిస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సహజీవనం, వివాహేతర సంబంధం కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెంకటేశ్ 15 ఏళ్లుగా తిరుపతిలో నివాసముంటున్నాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా వెంకటగిరి. అనిత స్వస్థలం తిరుపతిలోని సత్యనారాయణపురం.

ఇదీ చదవండి: ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం: సీఎం జగన్

Last Updated : Mar 16, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details