TOOFAN VEHICLE : ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద తుఫాన్ వాహనం దగ్ధమైంది. కనిగిరి నుంచి నర్సరావుపేటకు 8 మంది పెద్దలు ఐదుగురు చిన్నారులతో వెళ్తున్న వాహనం దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి ఇంజన్లో పొగలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవరు వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను కిందకు దింపాడు. ఆ తర్వాత బానెట్ తెరవబోతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కళ్ల ముందే వాహనం కాలిపోయింది. ప్రాణహాని లేకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రకాశం జిల్లాలో తుఫాన్ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం - ఏపీ తాజా వార్తలు
TOOFAN VEHICLE BURNT : ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కనిగిరి నుంచి నర్సరావుపేటకు వెళ్తున్న వాహనంలో దర్శి మండలం వెంకటాచలంపల్లి వద్ద ఇంజన్లో నుంచి పొగలు వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించారు.
![ప్రకాశం జిల్లాలో తుఫాన్ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం TOOFAN VEHICLE BURNT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16534721-786-16534721-1664705060177.jpg)
TOOFAN VEHICLE BURNT
ప్రకాశం జిల్లాలో తుఫాన్ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం