డోన్లో యువకుడిపై వేట కొడవలితో దాడి...
కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలోని రైల్వే గేటు వద్ద ఓ యువకుడిపై మరో యువకుడు వేటకొడవలితో దాడి చేశాడు. చిన్న మల్కాపురం గ్రామానికి చెందిన బోయ శేఖర్, రవిలు కలిసి ద్విచక్రవాహనంపై డోన్కు వచ్చారు. పట్టణంలో రైల్వే గేటు పడడంతో అక్కడ ఆగారు. రవి బండి దిగి గేటు దాటి ముందుకు వెళ్లాడు. గేటు తెరిచేలోపు బండి పైన ఉన్న శేఖర్పై తారక రామనగర్కు చెందిన రాజు వేటకొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కర్నూల్కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడి జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యం..
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కల్లిపూడి సమీపంలో తెలుగు గంగ కాలువలో మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు.. మృతుని వద్ద లభించిన ఆధారాలు ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన బాలాజీ(38)గా గుర్తించారు. అతనిది పుల్లూరు కాగా కొన్నేళ్లుగా వనపర్తిలో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడినట్లు స్థానికులు తెలిపారు. బంధువుల ఇంటికి వచ్చిన అతను తెలుగు గంగ కాలువలో శవమై తేలడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గంధం చెక్కల చోరీ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు..
అనంతపురం జిల్లా పెనుకొండలోని అటవీశాఖ కార్యాలయంలో జనవరి 17న 92 సంచుల శ్రీగంధపు చెక్కలు, 16లీటర్ల శ్రీ గంధం ఆయిల్ను చోరీ చేసిన దుండగుల్లో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమ్య తెలిపారు. ఈ కేసులో పోలీసులు బృందాలుగా ఏర్పడి కర్ణాటక, తమిళనాడులో గాలింపు చేపట్టారని తెలిపారు. మొత్తం 13 మంది ముద్దాయిలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 24న ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 68 సంచుల శ్రీగంధం చెక్కలు , రెండు లారీలు, ఒక కారు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సోమవారం ప్రధాన ముద్దాయిలు బాబాజాన్ అలియాస్ బాబ్జాన్, జయకుమార్ అలియాస్ సెల్వంలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువచేసే శ్రీగంధం ఆయిల్, రూ.11 లక్షల విలువచేసే 14 సంచుల శ్రీ గంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ.2500 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 13 మంది ఉండగా ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో సైకో హల్చల్..
అనంతపురం జిల్లా పెనుకొండ శివారులో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ సైకో హల్చల్ చేశాడు. హర్యానాకు చెందిన అగంతకుడు చేతిలో కత్తి పట్టుకుని హైవేపై వీరంగం సృష్టించాడు. అతని చర్యల వల్ల రహదారిపై వెళ్లే వాహనదారులు, గోనిపేట రోడ్డు పక్కన ఉన్న మహిళలు ఇబ్బందులు పడ్డారు. కత్తి లాక్కోవడానికి ప్రయత్నం చేసిన స్థానికులపై ఆ సైకో రాళ్లతో దాడి చేశాడు. స్థానికుల సమాచారం మేరకు హైవే పెట్రోలింగ్ కానిస్టేబుల్ లక్ష్మి నారాయణరెడ్డి, హోంగార్డు విశ్వతో హైవేపై గాలించారు. రాత్రి 11 గంటల సమయంలో అతను జాతీయ రహదారి ప్రక్కన గోనిపేట రోడ్డు సమీపంలో కత్తి పట్టుకొని నడుచుకొని వెళుతుండగా చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. కత్తి లాక్కుని కౌన్సిలింగ్ ఇచ్చారు.
రెండేళ్ల బాలుడిని బావిలో తోసి..