ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS News: చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

By

Published : Mar 16, 2022, 8:57 PM IST

సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తెలంగాణ హైదరాబాద్​లోని జవహర్​నగర్ పోలీస్​స్టేషన్​లో పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా.. అందులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
చెరువులో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

Three Students Died: హైదరాబాద్​లోని జవహర్​నగర్ పోలీస్​స్టేషన్​లో పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మల్కారం ఈదుళ్ల చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మొత్తం ఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా.. అందులో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థులకు ఈత రాకపోవడం వల్ల నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు.

గబ్బిలాల్​పేట్​లో నివాసం ఉంటున్న.. యువ చందు, విజయ్, నవీన్.. శిశు జ్ఞాన మందిర్ పాఠశాలలో 6, 7 తరగతి చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం సరదాగా ఈతకు వెళ్దామని ఆరుగురు విద్యార్థులు బయలుదేరారు. ఈతకు వెళ్లిన ఆరుగురిలో.. ముగ్గురు విద్యార్థులకు ఈత రాకపోవడంతో ప్రమాదం సంభవించింది.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఒక్కసారిగా జవహార్​నగర్​లో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసిన జవహార్​నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

చెత్తపన్ను చెల్లించలేదని కర్నూలు నగరపాలకసంస్థ సిబ్బంది నిర్వాకం..!

ABOUT THE AUTHOR

...view details