ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 13, 2021, 6:07 PM IST

ETV Bharat / crime

కొవిడ్​తో కొమారుడు.. ప్రమాదంలో తండ్రి మృతి!

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో మృతి చెందిన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ మరణించాడు. కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

road accident
కొవిడ్​తో కొడుకు.. ప్రమాదంలో తండ్రి మృతి

కొవిడ్​తో మృతి చెందిన కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. మోర్తాడ్​కు చెందిన మస్తా బాబన్న(60) వీఆర్​ఏగా విధులు నిర్వహిస్తున్నారు. అతని రెండో కుమారుడు ప్రాంతీశ్(30)కు కరోనా సోకడంతో.. జిల్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో ప్రాంతీశ్ ఇవాళ కన్నుముశారు.

కుమారుడి మృతదేహాన్ని తీసుకుని బాబన్న.. తమ స్వగ్రామమైన మొలతాడుకు​ బయలుదేరారు. జక్రాన్ పల్లి మండలం ఆర్గుల్ వద్ద 44వ జాతీయ రహదారిపై రాంగ్ రూట్​లో వస్తోన్న ఓ టిప్పర్.. వీరు ప్రయాణిస్తోన్న అంబులెన్స్​ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. బాబన్న అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కుటుంబంలో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడం పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details