శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేట పరిధిలోని మారుతినగర్లోని ఓ ఇంట్లో వ్యక్తి ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈయన యూనియన్ బ్యాంక్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతని పర్సలో ఓ అమ్మాయి ఫొటో ఉండడంతో ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతకవిటి ఎస్ఐ సీహెచ్. రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజాంలో వ్యక్తి అనుమానాస్పద మృతి - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ వ్యక్తి ఫ్యాన్కి ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
![రాజాంలో వ్యక్తి అనుమానాస్పద మృతి Suspicious death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10540567-410-10540567-1612756264933.jpg)
Suspicious death