ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్... ఒకరు మృతి - AP Crime news

Road Accident at srirangapuram: ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురంలో జరిగింది. బైక్​పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కోటతిప్పల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

Road Accident at srirangapuram
Road Accident at srirangapuram

By

Published : Feb 27, 2022, 10:54 AM IST

Road Accident at srirangapuram:ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగాపురం గ్రామం వద్ద ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న అయ్యప్ప(24)అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. వంశీ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు హనుమంతునిపాడు మండలం కోటతిప్పల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

హనుమంతునిపాడు నుంచి కనిగిరి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ శ్రీరంగాపురం వద్ద ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఘటన స్థలం నుంచి ట్రాక్టర్​తో సహా డ్రైవర్ పరారవ్వగా.. పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్​కి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు హనుమంతునిపాడు ఎస్సై పావని తెలిపారు.

ఇదీ చదవండి:Driver rapes woman: కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్​ అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details