ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

హైదరాబాద్ ఫీవర్ ఆసుత్రిలో.. భీమడోలువాసి ఆత్మహత్య - Hyderabad latest news

తెలంగాణలోని ఫీవర్ ఆస్పత్రిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్​తో బాధపడుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

suicide
ఫీవర్ ఆసుత్రిలో వ్యక్తి ఆత్మహత్య

By

Published : Mar 9, 2021, 9:42 AM IST

హైదరాబాద్​ నగరం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో పశ్చిమగోదావరి జిల్లా భీమడోలుకు చెందిన చిన్న శీను (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేబిస్ వ్యాధితో బాధపడుతూ నిన్న ఉదయం దవాఖానాలో చేరాడు.

అదే సాయంత్రం డాక్టర్లు పరీక్షించి పరిస్థితి చేజారిందని వివరించారు. అనంతరం రేబిస్ వార్డులోనే చిన్న శీను ఉరి వేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నల్లకుంట పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details