ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Parking: కారు పార్కింగ్​ వివాదం.. డాక్టర్​ను ఏం చేశారో తెలుసా!!

Attack on doctor: తమ ఆసుపత్రి స్థలంలో పార్క్ చేసిన కారును తీయమనడమే ఆ డాక్టర్​ చేసిన పాపం..కోపోద్రిక్తులైన కొందరు యువకులు ఆ డాక్టర్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో ఇప్పుడు వైరల్​గా మారాయి.

By

Published : Oct 14, 2022, 12:40 PM IST

Published : Oct 14, 2022, 12:40 PM IST

Updated : Oct 14, 2022, 12:55 PM IST

Attack on doctor
కారు పార్కింగ్​ వివాదం

కారు పార్కింగ్​ వివాదం.. డాక్టర్​ను ఏం చేశారో తెలుసా!!

Attack on doctor in old city: కారు పార్కింగ్ విషయంలో కొందరు యువకులు ఓ డాక్టర్​పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. లాల్​దర్వాజా ప్రాంతంలోని ఓప్రైవేటు ఆసుపత్రి వద్ద కారు పార్కింగ్​ విషయంలో డాక్టర్​ ప్రశాంత్​కు ఆసుపత్రి పక్కింటి వారికి వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన పక్కంటివారు.. డాక్టర్​పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుని భార్య ఫిర్యాదు మేరకు విషయం తెలుసుకున్న షాలిబండ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్​ ఆరోగ్యం విషమంగా ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ప్రశాంత్​ భార్య తెలిపారు.

"తమ ఆస్పత్రి ముందు పక్కింటివారు కారు పార్క్ చేశారు. తియ్యమని తాము చెప్పినందుకు తమ ఆస్పత్రి లోపలికి వచ్చి తమపై దాడి చేశారు. గత కొన్ని రోజుల నుంచి పక్కింటివారు తమ ఆస్పత్రి ముందే కారు పార్క్ చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పినా వారు వినడంలేదు. ఈ రోజు కారు తీయండి లేకుంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తామంటే మాపై దాడి చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయులో చికిత్స పొందుతున్నారు".-నేహా, డాక్టర్​ ప్రశాంత్​ భార్య

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details