ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

LIVE VIDEO: దారుణం.. అందరూ చూస్తుండగా రైలు కిందపడిపోయాడు!

Train Accident: రైలు కింది పడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

By

Published : Dec 30, 2021, 8:34 PM IST

సైకిల్​ మీది నుంచి నేరుగా రైలు కిందికి
సైకిల్​ మీది నుంచి నేరుగా రైలు కిందికి

సైకిల్​ మీది నుంచి నేరుగా రైలు కిందికి

Train Accident: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బొగ్గు తరలించే రైలు కింద పడి చూస్తుండగానే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్​కు చెందిన ఇసాక్(50) సైకిల్​పై పని నిమిత్తం స్టేషన్ బస్తీకి వెళ్తున్నాడు. ఆ మార్గంలో ఇల్లందు నుంచి డోర్నకల్ వైపు బొగ్గు తరలించే రైల్వే మార్గం ఉంది. ఈ క్రమంలో సైకిల్​ అదుపుతప్పి బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు కింద పడిపోయాడు. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. తీవ్రగాయాలతో బాధపడుతున్న బాధితుడి పరిస్థితి చూసిన స్థానికులు 108 నెంబర్​కు ఫోన్ చేశారు. అరగంట అయినా అంబులెన్స్ రాకపోవటంతో అతన్ని ఒక ట్రాలీ వాహనంలో ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

పరిస్థితి విషమించడంతో వైద్యులు ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే ఖమ్మంకు తరలించగా.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనపై ఆరా తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details