ACCIDENT: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో యాత్రికులతో కూడిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా వెల్మల్కు చెందిన సరలమ్మ(70) మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఔరంగాబాద్ పట్టణంలో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బోల్తా.. ఒకరు మృతి - Kashi yatra Bus Accident
ACCIDENT: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బిహార్లో ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్లో బస్సు బోల్తా పడగా.. నందిపేట్ మండలం వెల్మల్కు చెందిన వృద్ధురాలు సరలమ్మ(70) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదసమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులున్నారు.
![తెలంగాణ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బోల్తా.. ఒకరు మృతి ACCIDENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15377667-458-15377667-1653441100989.jpg)
నిజామాబాద్ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బోల్తా
ఈ నెల 24న 38 మంది యాత్రికులతో కూడిన ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీ యాత్రకు బయలుదేరింది. బస్సులో నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్తో పాటు పాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఔరంగాబాద్లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుకనుంచి లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. బస్సు దెబ్బతినడంతో తమకు రవాణా సౌకర్యం తో పాటు.. మృతదేహాన్ని తరలించేలా చూడాలని యాత్రికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: