Gun firing on Realtors: స్థిరాస్తి వ్యాపారంలో గొడవలు ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీశాయి. ఏకంగా తుపాకులతోనే కాల్చుకునే పరిస్థితికి తీసుకొచ్చాయి. తెలంగాణలోని హైదరాబాద్ నగరశివారులో కాల్పుల ఘటన కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైన స్కార్పియో వాహనాన్ని స్థానికులు గమనించారు. కారుపై రక్తపు మరకలు ఉండటం.. వాహనంలో ఓ వ్యక్తి స్పృహలో లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మరో వ్యక్తి శ్రీనివాస్రెడ్డి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వ్యక్తిని రాఘవేందర్ రెడ్డిగా గుర్తించారు. హైదరాబాద్ బీఎన్రెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాఘవేందర్ మృతి చెందారు. అతని ఛాతీ కింద బుల్లెట్ గాయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వ్యాపారంలో వివాదాలే కారణమా
Realtors Murder at Ibrahimpatnam : "పటేల్గూడలో ఏడాది క్రితం 22 ఎకరాల్లో శ్రీనివాస్ రెడ్డి వెంచర్ వేశారు. కాగా శ్రీనివాస్రెడ్డి వెంచర్ పక్కనే మట్టారెడ్డికి చెందిన భూమి ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య 6 నెలలుగా భూ వివాదం జరుగుతోంది. మట్టారెడ్డి మాట్లాడుకుందామని పిలవడంతోనే శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డి వెంచర్ వద్దకు తెల్లవారుజామున వెళ్లారు. అక్కడే కొందరు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. దీని వెనక ఉంది మట్టారెడ్డేనని మా అనుమానం."
- మృతుల కుటుంబీకులు
వెంబడించి కాల్చారు..