తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనుముల మండలం చింతగూడెం స్టేజి సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులంతా నల్గొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు యువకులు బైక్పై నల్గొండ వైపు వెళ్తుండగా.. నల్గొండ నుంచి వస్తున్న టిప్పర్ చింతగూడెం స్టేజీ సమీపంలో ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతి చెందారు.