ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

చిక్కడపల్లిలో కాల్పుల కలకలం.. తుపాకీతో కాల్చుకుని లాయర్​ సూసైడ్​ - తెలంగాణ తాజా నేర వార్తలు

Lawyer suicide: అతనో న్యాయవాది.. పైగా వాయుసేన రిటైర్డ్​ ఉద్యోగి... కడపకు చెందిన అతను భార్యతో విడాకులు తీసుకుని హైదరాబాద్​లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈరోజే ఊరెళ్లొచ్చిన అతను.. ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు... కంగారుపడ్డ బంధువులు ఇంటికొచ్చి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నాడు.. అసలేం జరిగింది.

revolver
suicide

By

Published : Jul 22, 2022, 9:06 PM IST

హైదరాబాద్‌ చిక్కడపల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శివారెడ్డి గతంలో వాయుసేనలో పనిచేసి పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శివారెడ్డి తన భార్య నుంచి విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం 6గంటలకు కడప నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకుని తిరిగి బయటకు రాలేదు.

బంధువులు ఫోన్‌ చేసినా ఆయన ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చిన బంధువులు శివారెడ్డి ఇంటికి చేరుకుని తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్నారు. తన లైసెన్స్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details