ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

Saidabad Incident: చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయింది: కేటీఆర్​ - KTR TWEET ON SAIDABAD RAPE CASE ACCUSED RAJU SUICIDE

నిందితుడు రాజు ఆత్మహత్యపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయిందని వెల్లడించారు. రైల్వే ట్రాక్‌పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ చెప్పినట్లు తెలిపారు.

Saidabad Incident
Saidabad Incident

By

Published : Sep 16, 2021, 12:19 PM IST

తెలంగాణలోని సంచలనం సృష్టించిన సైదాబాద్‌ ఆత్యాచార కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే ట్రాక్ వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా అతని కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్డడం సహా సామాజిక మాధ్యమాల్లో పోటోలు..... విస్తృతంగా ప్రచారం జరగడంతో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. చిన్నారిపై హత్యాచారం చేసిన మృగం చనిపోయినట్లు​ ట్విటర్​ వేదికగా తెలిపారు. జనగామ జిల్లాలోని స్టేషన్​ ఘన్​పూర్​ రైల్వే ట్రాక్​పై మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి చెప్పినట్లు పేర్కొన్నారు.

సైదాబాద్ ఘటన నిందితుడి మృతదేహం గుర్తించినట్లు డీజీపీ మహేందర్​రెడ్డి ట్విటర్​ వేదికగా తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైందన్నారు. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా మృతదేహం గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: దేశంలో మళ్లీ పెరిగిన కేసులు- కొత్తగా 30వేల మందికి వైరస్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details