తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు (TRS MP Nama Nageswara Rao) ఇంట్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు సోదాలు జరిపారు. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్లు వచ్చిన అభియోగం నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.వెయ్యి కోట్లు మోసం చేసినట్లు అభియోగం నమోదైంది. హైదరాబాద్లో ఐదు ప్రాంతాల్లోని మధుకాన్ గ్రూప్ కంపెనీ కార్యాలయాల్లో ఒకే సమయంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.