Keyman Saved Woman and Childs: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన మహిళ భర్తతో గొడవపడి తల్లిగారింటికి బయల్దేరింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు వచ్చింది. అక్కడినుంచి దుర్గాడ రైల్వేస్టేషన్కు చేరుకుని.. ఇద్దరు పిల్లలతో సహా విశాఖ-విజయవాడ వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుంది. ఇది గమనించిన రైల్వే కీమాన్ వెంకటేశ్వరరావు.. ముగ్గురిని రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో పిఠాపురం సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని.. మహిళతో మాట్లాడి కాకినాడ దిశ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముగ్గురు ప్రాణాలు కాపాడిన కీమాన్ వెంకటేశ్వరరావును పోలీసులతో పాటు పలువురు అభినందించారు.
భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం - దుర్గాడ రైల్వేస్టేషన్
Keyman Saved Woman and Childs: భర్తతో గొడవపడి మనస్తాపంతో అమ్మగారింటికి బయల్దేరింది. ఏమైందో ఏమో ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి చనిపోవాలనుకుంది. ట్రాక్పై రైలుకు ఎదురుగా వెళ్తుండగా.. కీమాన్ గుర్తించి రక్షించారు. కీమాన్ సకాలంలో గుర్తించడంతో ముగ్గురి ప్రాణాలు దక్కాయి.
woman and child saved