ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / crime

కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య - amaravathi news

మద్యానికి బానిసైన ఓ కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

police department person suicide
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య

By

Published : May 4, 2021, 6:24 PM IST

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలోని సూరారంలో నివసించే కానిస్టేబుల్ రమణ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్​గా పనిచేసిన రమణమూర్తి(38) ఏడేళ్ల క్రితం హైదరాబాద్​కు వచ్చి గన్​మెన్​గా విధులు నిర్వహించారు.

కొన్ని రోజులుగా మద్యానికి బానిసైన రమణ మూర్తి తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో భార్య తన సోదరుడి ఇంటికి వెళ్లిన తర్వాత మే1న రమణ మూర్తి ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details