అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం బాట్లో కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతిచెందారు. ఓ ద్విచక్రవాహనదారుడు.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి డివైడర్కు ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైకుపై ఉన్న ఆ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మృతులు శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెలు.. భాస్కర్, గీతగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.