ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 10, 2021, 8:04 AM IST

ETV Bharat / city

కుమారునితో భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

పుట్టిన రోజు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తగాదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండేళ్ల కుమారునితో ఓ తల్లి భవనంపై నుంచి దూకింది. దాంతో తల్లిబిడ్డా మృతి చెందారు. ఈ ఘటన విశాఖపట్నం గాజువాకలో జరిగింది.

ఆత్మహత్య
ఆత్మహత్య

రెండేళ్ల కుమారునితో కలిసి.. ఓ తల్లి భవనంపై నుంచి దూకి మృతి చెందింది. విషాదకరమైన ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాకలో జరిగింది. చుక్కవానిపాలేనికి చెందిన జయంతి బెహరా.. ఆమె రెండేళ్ల కుమారుడు రోహిన్​ బహెరా పుట్టిన రోజు వేడుక విషయంలో కుటుంబసభ్యుల మధ్య వివాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

మనస్థాపం చెందిన తల్లి.. కుమారునితో కలిసి నాలుగంతస్థుల భవనంపై నుంచి దూకింది. దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కుమారుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details