ప్రస్థానం మొదలైందిలా..
- 1888 తర్వాత ఓల్డ్టౌన్ ప్రాంతంలో, పోర్టు దగ్గర వైజాగపట్నం టౌన్ రైల్వేస్టేషన్ను అప్పటి ‘ఈస్ట్కోస్ట్ స్టేట్ రైల్వే’ నిర్మించింది. అక్కడి నుంచి 1893లో తొలి సరకు రవాణా (గూడ్స్’) రైలును, 1894లో ప్రయాణికులకు తొలి ప్యాసింజర్ రైలును నడిపింది.
- ఇప్పుడున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ను 1969-72 మధ్య నిర్మించారు. దీన్ని ‘వాల్తేరు రైల్వే స్టేషన్’ అని పిలిచేవారు. ప్రారంభంలో ఇక్కడివరకే ప్యాసింజర్ రైళ్లొచ్చి ఆగేవి. ఓల్డ్టౌన్కు వెళ్లాల్సినవారి కోసం ఇక్కడి నుంచి ప్రత్యేక షటిల్ సర్వీసు రైలుండేది.
- 1973 ప్రాంతంలో ఓల్డ్టౌన్ రైల్వేస్టేషన్ను మూసేశారు. అప్పటి నుంచి వాల్తేరు రైల్వే స్టేషన్ మరింత కీలకంగా మారింది. ఆ తర్వాత ఈ స్టేషన్కు 1987లో ‘విశాఖపట్నం’ అని పేరుపెట్టారు. అలా మొదలైంది మరో ప్రస్థానం.
నౌకాశ్రయంతో నగరానికి ఎంతో గుర్తింపు వచ్చింది. స్టీల్ప్లాంట్ ఏర్పాటయ్యాక నగర పేరు ప్రఖ్యాతులు మరింతగా విస్తరించాయి. ప్రయాణాలు కూడా పెరిగిన నేపథ్యంలోనే వాల్తేరు రైల్వేస్టేషన్కు నాంది అయింది. 1969-72 మధ్య నిర్మాణాలు పూర్తి చేశారు. అప్పట్లో స్టీమ్ లోకోలే ఎక్కువ. దాని షెడ్ కూడా స్టేషన్ పక్కనే ఉండేది. కేకే లైన్లో సరకు రవాణా చేసేందుకు కేవలం 3, 4 మాత్రమే డీజిల్ లోకోలు ఉండేవి. ఇప్పుడు మాత్రం దేశంలోనే ప్రఖ్యాత స్టేషన్లలోనే ఒకటిగా నిలిచింది. ఏకంగా కొత్తగా ఏర్పడే దక్షిణకోస్తా రైల్వే జోన్కు కేంద్రం కానుంది.
అప్పుడు: ప్రారంభంలో హావ్డా - చెన్నై కోరమాండల్, మెయిల్, హావ్డా-హైదరాబాద్ ఈస్ట్కోస్ట్, భువనేశ్వర్-ముంబయి కోణార్క్, పూరి-తిరుపతి జనతా, నిజాముద్ధీన్ సమతా రైళ్లు ఉండేవి. 1976లో విశాఖ నుంచి గోదావరి రైలు మొదలైంది. అప్పట్లో రోజుకు 14 రైళ్లు వాల్తేరు స్టేషన్ మీదుగా రాకపోకలు చేసేవి.
ఇప్పుడు:వాల్తేరు డివిజనే సొంతంగా 37 రైళ్లు విశాఖ నుంచి నడుపుతోంది. రోజు వారీ విశాఖకు 112 రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో రైళ్ల రాకపోకల్ని పరిమితంగా చేశారు.
4 ప్లాట్ఫామ్ల నుంచి