ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 1:16 PM IST

ETV Bharat / city

ఐటమ్ సాంగ్ ఆఫర్​తో లక్షలు దోచేసిన నిందితుడి అరెస్టు

సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ ఇస్తామని యువతిని నమ్మించి రూ. 5 లక్షలు మోసం చేసిన నిందితుడు గీత ప్రసాద్​ను విశాఖ కంచరపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై మూడు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

ఐటమ్ సాంగ్ ఆఫర్​తో లక్షలు దోచేసిన నిందితుడు అరెస్టు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి గీత ప్రసాద్ మూడు నెలల క్రితం విశాఖ మురళీనగర్ ప్రాంతంలో గీతాలయ స్టూడియోస్ స్థాపించి జూనియర్ ఆర్టిస్ట్​లు కావాలని పత్రిక ప్రకటన ఇచ్చాడు. ప్రకటన చూసిన చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ఓ యువతి అతడిని సంప్రదించింది. సినిమాలో ఐటమ్ సాంగ్ అవకాశం కల్పిస్తానని నమ్మించి, మురళీనగర్​లోని ఓ అపార్ట్ మెంట్​లో ఆమెను ఉంచి చిన్నపాటి షూటింగ్​లు నిర్వహించాడు. షూటింగ్​ కోసం రూ.5 లక్షలు కావాలని యువతిని నమ్మించి.. ఆమె వద్ద నుంచి పలు దఫాలుగా గీత ప్రసాద్ డబ్బు తీసుకున్నాడు.

గీత ప్రసాద్ తీరుపై అనుమానం వచ్చిన యువతి... అతన్ని నిలదీసింది. దీంతో గీత ప్రసాద్ అతడి స్నేహితులు సత్యనారాయణ, షరీఫ్‌ ,కె.పి సారథి యువతిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై యువతి వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ జి.స్వరూపరాణికి ఫిర్యాదు చేయడంతో.. ఏసీపీ సూచనల మేరకు కంచరపాలెం పోలీసులు గీత ప్రసాద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా గీత ప్రసాద్​తో పాటుగా అతడి స్నేహితులు షరీఫ్, సత్యనారాయణలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

ఇదీ చదవండి :అప్పుడేమైపోయింది సీఐడీ... వైకాపా అక్రమాలపై అరెస్టులేవీ?

ABOUT THE AUTHOR

...view details