ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 25, 2020, 10:20 AM IST

ETV Bharat / city

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. పార్క్ హయత్ రాజకీయం సరికాదు:విజయసాయిరెడ్డి

నిమ్మగడ్డ రమేశ్ కుమార్​పై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

vijayasaireddy comments on nimmagadda ramesh kumar
vijayasaireddy comments on nimmagadda ramesh kumar

నిమ్మగడ్డ రమేశ్​ రాజ్యాంగ పదవిలో ఉండి పార్క్ హోటల్ లో రాజకీయ వ్యవహరం చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి అన్నారు. ఈ వ్యవహరంపై విచారణ జరగాలని కోరారు. కేంద్రానికి నిమ్మగడ్డ రమేశ్ రాసిన ఉత్తరం ఆయన రాసిన లేఖ కాదని, తెదేపా కార్యాలయంలో తయారైనట్టు ఆరోపించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు.. ఎంపీ సుజనాకు వ్యాపార లావాదేవీలు ఏముంటాయని ప్రశ్నించారు. పార్క్ హయత్​లో జరిగిన వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details