ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Visakhapatnam: అనకాపల్లి క్వారీల్లో విజిలెన్స్​ తనిఖీలు

By

Published : Jul 15, 2021, 1:59 PM IST

అనకాపల్లిలోని పలు క్వారీల్లో అక్రమాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా గనుల శాఖ విజిలెన్స్ ఎన్​ఫోర్సుమెంట్​ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 రోజుల పాటు ఈ తనిఖీలుంటాయని తెలిపారు.

విజిలెన్స్​ తనీఖీలు
విజిలెన్స్​ తనీఖీలు

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని పలు క్వారీల్లో గనుల శాఖ విజిలెన్స్ ఎన్​ఫోర్సుమెంట్​ అధికారులు తనిఖీలు చేపట్టారు. బుధవారం నుంచి ప్రారంభమైన ఈ తనిఖీలు 15 రోజులపాటు చేపడుతున్నట్లు విజిలెన్స్ ఎన్​ఫోర్సుమెంట్ ఏడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు.

ఎంత మేర లీజుకు తీసుకున్నారు.. ఎంతమేర తవ్వకాలు చేపట్టారు.. తదితర విషయాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీ జరిమానా విధిస్తామని ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీలకు వర్షం అడ్డంకిగా మారింది.

ఇదీ చదవండి:మన్యంలో అక్రమ మైనింగ్‌కు ప్రభుత్వం సహకరిస్తోంది

ABOUT THE AUTHOR

...view details