కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రధాన కార్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రక్రియలో భాగంగా భవనం కోసం బోర్డు యాజమాన్యం అన్వేషణ చేస్తోంది. ఈ మేరకు మంగళవారం నుంచి శుక్రవారం వరకు ముగ్గురు సభ్యుల బృందం విశాఖపట్నంలో పర్యటించి అనువైన అద్దె భవనాలను పరిశీలించనుంది. బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా, కార్యదర్శి డీఎం రాయ్పురే, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.వేణుగోపాల్ ఈ పర్యటనలో పాల్గొననున్నారు. సహకరించాలని కోరుతూ బోర్డు సభ్యుడు హరికేశ్ మీనా.. ఏపీ జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్నకు లేఖ రాశారు. ఈ నెల మొదటి వారంలో బోర్డు అధికారులు కొందరు విశాఖపట్నంలో పర్యటించి వచ్చారు.
నేటి నుంచి విశాఖలో కృష్ణా బోర్డు సభ్యుల పర్యటన - కృష్ణా బోర్డు తాజా వార్తలు
కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం ఇవాళ్టి నుంచి విశాఖలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ప్రధాన కార్యాలయ వసతి భవనాలను పరిశీలించనుంది.

విశాఖలో పర్యటించనున్న కృష్ణా బోర్డు సభ్యులు