ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముగిసిన వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు... విజేతగా మద్దిలపాలెం జట్టు

వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు విశాఖలో సందడిగా ముగిశాయి. ఫైనల్​ మ్యాచ్​లో మద్దిలపాలెం జట్టు... లయన్స్ జట్టుపై గెలుపొంది విజేతగా నిలిచింది.

By

Published : Jan 10, 2021, 10:32 AM IST

The YSR Cup cricket tournament ended in Visakhapatnam.
ముగిసిన వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు

విశాఖలో వైఎస్సార్ కప్ క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో మద్దిలపాలెం జట్టుకు, లయన్స్ జట్లకు మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ పోరులో 2 వికెట్ల తేడాతో మద్దిలపాలెం జట్టు విజేతగా నిలిచింది. గెలుపొందిన జట్టుకు 10 లక్షల రూపాయల చెక్కును రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందజేశారు.

ప్రగతిభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఎం.వి.వి. సత్యనారాయణ, సత్యవతి, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details