ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'డాక్టర్ సుధాకర్​ మరణం కలచివేసింది'

By

Published : May 22, 2021, 7:58 AM IST

డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం.. తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా నేత వంగలపూడి అనిత అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

vagalapudi anitha over doctor death
డాక్టర్ సుధాకర్​ మృతి తీవ్రంగా కలచివేసింది

దళిత మేధావి, సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం దురదృష్టకరమంటూ.. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. న్యాయం కోసం తుది శ్వాస విడిచే వరకు పోరాడిన సుధాకర్ కేసులో.. గత నెల 27న సీబీఐ తుది తీర్పు వెలువడాల్సి ఉంది.

కానీ అనివార్య కారణాల వల్ల తీర్పు వెలువడే సమయం ఆలస్యం అవ్వడం, మరో వైపు ఉద్యోగం లేకపోవడం డాక్టర్ సుధాకర్​ను తీవ్రంగా కుంగదీశాయని అనిత అన్నారు. సుధాకర్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న అనిత.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, దేవుడు వారి కుటుంబానికి మనోబలం ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details