విశాఖ షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఓఆర్ఎస్ ఇచ్చి పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష విరమింపజేశారు. ఉక్కు పరిశ్రమ కోసం పల్లా 6 రోజులు దీక్ష చేశారని చంద్రబాబు అన్నారు.
పల్లాతో దీక్ష విరమింపజేసిన చంద్రబాబు - palla srinivas agitation on vishaka steel plant
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్షను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విరమింపజేశారు. విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఓఆర్ఎస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్లా శ్రీనివాసరావు నిరశన దీక్ష చేపట్టారు.
babu
సోమవారం అర్ధరాత్రి పల్లా ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈ నెల 10న పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రబాబు పర్యటనకు ముందే పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఇదీ చదవండి:ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు
Last Updated : Feb 17, 2021, 6:50 AM IST