విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర.. ఈరోజు శ్రీకాకుళంలో జరిగింది. పట్టణంలోని డేఅండ్ నైట్ సెంటర్ నుంచి భక్తులు శోభాయాత్ర నిర్వహించి.. స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామిని, శ్రీకూర్మంలో కూర్మనాథ స్వామిని, విజయదుర్గ ఆలయాన్ని, లక్ష్మీ గణపతి ఆలయాన్ని, కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని, కోటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన సందర్శించారు.
శారదా పీఠానికి బీజం పడింది శ్రీకాకుళంలోనే...
శారదా పీఠానికి బీజం పడింది శ్రీకాకుళం జిల్లాలోనే అని.. గురువులు స్వరూపానందేంద్రుల జన్మస్థలం దేరసాం ఇక్కడిదేనని స్వాత్మానందేంద్ర స్వామి వివరించారు. హైందవ ధర్మ జాగృతికి హిందువులంతా సైనికుల్లా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్వహణకు ఇతోధికంగా సాయం చేయాలని సూచించారు. ఇది దైవారాధనతో సమానమన్నారు.