సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృశింహస్వామి వారి ఆవిర్భావ తార.. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం సింహగిరిపై సుదర్శన నృసింహ హోమం, పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో చక్రపెరుమాళ్ స్వామిని అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ విశేష అర్చనలు, యజ్ఞం నిర్వహించారు. పవిత్ర జలాలతో బేడామండపం ప్రదక్షిణ చేశారు. పూర్ణాహుతితో యజ్ఞ పరిసమాప్తి చేశారు.
సంప్రదాయబ్ధంగా స్వాతి నక్షత్ర పూజలు - సింహాచలంలో స్వాతి నక్షత్ర హోమం తాజా వార్తలు
విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో స్వామి వారి నామ నక్షత్రమైన స్వాతి నక్షత్ర పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ నెలలో ఒక్కరోజే ఈ పూజలు జరుపుతారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి లేకపోవడం వల్ల వీరు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని పూజలో పాలుపంచుకున్నారు.
సింహాచలం సన్నిధిలో స్వాతి నక్షత్ర హోమం