విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసరాలు రద్దీగా మారాయి. శివరాత్రి జాగరణ తర్వాత సముద్ర స్నానాలు ఆచరించడానికి ప్రజలు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. సింహాచలం, మధురవాడ, గాజువాక శివారు ప్రాంతాలన్నీ కలుపుతూ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. తీరప్రాంతాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ గార్డ్స్ను కూడా యంత్రాంగం అప్రమత్తం చేసింది.
రద్దీగా ఆర్కే బీచ్.. భక్తుల సముద్ర స్నానాలు
విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద శివరాత్రి జాగరణ తర్వాత భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే బీచ్కు చేరుకుని భక్తులు స్నానాలు చేస్తున్నారు.
sivarathri sea bath at Vishakhapatnam