ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దేవ స్వరూపం.. సింహచల వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంతో దర్శనమిచ్చారు. ఆలయ ఛైర్పర్సన్ సంచయిత గజపతి.. స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సింహాచలేశుడు - సింహాద్రి అప్పన్న దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
సింహాచల వరహా లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి సందర్బంగా భక్తులకు స్వర్ణ కవచ అలంకారంలో దర్శనమిచ్చారు. తెల్లవారు జాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అప్పన్నస్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
simhachalam temple in vishakapatnam
ఉత్సవ మూర్తులుగా దేవి సమేత వరాహ లక్ష్మీ నరసింహుడుగా ముందుగా దర్శనమిచ్చి.. అనంతరం మూల విరాట్ను దర్శనం చేసుకునెలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నియమాలు అనుసరిస్తూ ఎలాంటి అసౌకర్యం లేకుండా భక్తులకుదర్శన భాగ్యం కల్పించేలా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారి సేవలో ప్రముఖులు