ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సింహాద్రి అప్పన్న భూముల్లో అవకతవకలపై విచారణ ! - విశాఖ సింహాచలం ఆలయం వార్తలు

సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందనోత్సవం రోజు జరిగిన సంఘటనకు రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. రాష్ట్ర జాయింట్ కమిషనర్లు చంద్రశేఖర్ ఆజాద్ దర్యాప్తు ప్రారంభించారు. స్వామికి చెందిన భూముల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో దానిపైనా విచారణ చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.

simhachalam temple
simhachalam temple

By

Published : May 18, 2020, 7:22 PM IST

అప్పన్న దేవాలయంలో చందనోత్సవం రోజున ఒక భక్తుడిని లోనికి అనుమతించిన విషయంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. దీనిపై కమిటీ వేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.

విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా ఓ భక్తుడిని దర్శనానికి తీసుకువెళ్లిన ఘటనలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులుని ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని.. విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలని దేవస్థానానికి సూచించింది.

దీంతో ఓ కమిటీని నియమించారు. నేడు ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కమిటీ తెలిపింది. స్వామికి చెందిన భూముల్లో అవకతవకలు జరిగాయని తమకు ఫిర్యాదులు రావడంతో దానిపైన తగు విచారణ చేస్తామని అధికారి చంద్రశేఖర్ తెలిపారు. దేవస్థాన స్థలంలో చేపట్టిన దేవస్థానం ఉద్యోగుల యూనియన్ బిల్డింగ్ నిర్మాణం పై పలు ఫిర్యాదులు రావడంతో ఆ నిర్మాణం పై కూడా విచారణ చేపట్టనున్నారు.

ఇదీ చదవండి:మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details