అప్పన్న దేవాలయంలో చందనోత్సవం రోజున ఒక భక్తుడిని లోనికి అనుమతించిన విషయంలో ప్రధాన అర్చకుడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసింది. దీనిపై కమిటీ వేయడంతో అధికారులు విచారణ చేపట్టారు.
విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం రోజున అనుమతి లేకుండా ఓ భక్తుడిని దర్శనానికి తీసుకువెళ్లిన ఘటనలో ఆలయ ప్రధాన అర్చకులు గోపాల కృష్ణమాచార్యులుని ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని.. విచారణ జరిపి అనంతరం చర్యలు తీసుకోవాలని దేవస్థానానికి సూచించింది.