ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2021, 2:44 PM IST

ETV Bharat / city

cannabis: రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

cannabis: విశాఖపట్నం నక్కపల్లి మండలం కాగిత టోల్‌ప్లాజా వద్ద.. పోలీసులు వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.50 లక్షలు ఉంటుందని అంచనా.

cannabis
cannabis

cannabis: విశాఖపట్నం నక్కపల్లి మండలం కాగిత టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేసి.. రూ.50 లక్షల విలువైన వెయ్యి కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వ్యాన్‌లో ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా.. పోలీసులను ముందుగానే గుర్తించి, వాహనం వదిలి ఇద్దరు నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు.

విజయనగరం జిల్లా సాలూరులోనూ 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్‌కు లారీలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Ganja seized in Hyderabad: హైదరాబాద్​లో రూ.3 కోట్లు విలువైన గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details