ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SADHU PARISHAT ON COWS DEATH: గో-సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే: సాధుపరిషత్​ - ఏపీ తాజా వార్తలు

SADHU PARISHAT ON COWS DEATH: విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమ గోశాలలో ఆవుల మృతిపై సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గోవుల సంరక్షణ ప్రభుత్వానిదేనని.. వాటికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

SADHU PARISHAT ON COWS DEATH
SADHU PARISHAT ON COWS DEATH

By

Published : Dec 19, 2021, 10:57 AM IST

గోశాలలో ఆవుల మృతిపై సాధుపరిషత్తు ఆగ్రహం

SADHU PARISHAT ON COWS DEATH: విశాఖ వెంకోజీ పాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో తరలించిన గోవులు చనిపోతున్న వైనంపై సాధుపరిషత్తు స్పందించింది. ఈ గోవుల సంరక్షణ చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు అధ్యక్షులు శ్రీనివాసనంద సరస్వతి డిమాండ్ చేశారు.

గోశాలలో ఆవుల దీన పరిస్థితిని పరిశీలించిన ఆయన.. వాటికి కనీసం ఏం కావాలన్న అంశాలను పట్టించుకోని అధికార యంత్రాంగం పాలకుల తీరును ఎండగట్టారు. ఇప్పటికే పదికి పైగా గోవులు మృత్యువాత పడ్డాయని మిగిలినవి చనిపోకుండా.. చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details