ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విశాఖలో కృష్ణా నదీ బోర్డు ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలించాలి'

కృష్ణా నదీ బోర్డు ప్రధాన కార్యాలయం కోసం విశాఖపట్నంలో స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా.. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

By

Published : Mar 30, 2021, 10:48 PM IST

Krishna River Board
కృష్ణానదీ యాజమాన్య బోర్డు

విశాఖలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవకాశాన్ని పరిశీలించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలిపింది. ఈ మేరకు పరిశీలించిన వాటిలో ఒకదాన్ని రాష్ట్ర ప్రభుత్వం లీజుకు తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని బోర్డు కోరింది. ప్రస్తుతం హైదరాబాద్ జలసౌధలో ఇస్తున్న తరహాలోనే ఉచితంగా వసతిని వైజాగ్​లోనూ కల్పించాల్సిన అవసరం ఉందని... ఉచిత వసతికి సంబంధించిన సమాచారం తమకు ఇంకా అందలేదని బోర్డు పేర్కొంది.

కార్యాలయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు మార్చాలని కేంద్ర జలశక్తి శాఖ కోరుతున్నందున... వీలైనంత త్వరగా సంబంధిత సమాచారం ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా.. రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శికి లేఖ రాశారు. బోర్డుకు చెందిన ఇంజనీర్ల బృందం.. ఏప్రిల్ మొదటి వారంలో విశాఖలో పర్యటిస్తుందని లేఖలో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details