విశాఖలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని పోలీసు కమిషనర్ ఆర్కే మీనా విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రబలకుండా ఉండేందుకు జనతా కర్ఫ్యూ ఎంతో కీలకమని వివరించారు. పోలీసు శాఖ ప్రత్యేకమైన ఆంక్షలేవీ విధించడం లేదని... ప్రజలు స్వచ్ఛందంగా తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. నిత్యవసరాలు సహా అత్యవసర సేవలకు ఎక్కడా ఆటంకం ఉండదని చెప్పారు. పోలీసు శాఖ ఈ విషయంలో ప్రజలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని వివరించారు.
జనతా కర్ఫ్యూ విజయవంతానికి ప్రజలు సహకరించాలి: సీపీ - latest updates of janatha curfew
జనతా కర్ఫ్యూను విజయవంతం చేసేందుకు ప్రజలు సహకరించాలని విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని కోరారు.

police commissioner rk meena on janatha curfew