ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 25, 2022, 8:53 AM IST

ETV Bharat / city

PM Interaction with Bala Puraskar Recipients : బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్....

PM Interaction with Bala Puraskar Recipients : ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పలుకరించారు. ఈ అవార్డులను అందుకున్నవారిలో విశాఖకు చెందిన నేవీ చిల్ట్రన్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వీర్ కాశ్యప్, సత్యసాయి విద్యావిహార్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ అమేయలు ఉన్నారు.

PM Interaction with Bala Puraskar Recipients
బాల పురస్కార్ గ్రహీతలతో మోదీ వీడియో కాన్ఫెరెన్స్....

PM Interaction with Bala Puraskar Recipients : ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పలుకరించారు. ఈ అవార్డులను అందుకున్నవారిలో విశాఖకు చెందిన నేవీ చిల్ట్రన్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి వీర్ కాశ్యప్, సత్యసాయి విద్యావిహార్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ళ అమేయలు ఉన్నారు. కాశ్యప్ కి టెక్నాలజీలో ఈ అవార్డు వరించగా, అమేయ శాస్త్రీయ నృత్యం ఇతర అంశాలలో ఈ అవార్డు లభించింది. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రధాని మోదీతో పురస్కారం గ్రహీతలిద్దరూ వీసీలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున వారికి ప్రధాని తరఫున పురస్కారాలను అందజేశారు. కాశ్యప్, అమేయలతో పాటుగా వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అభినందించారు. 2021 సంవత్సరానికి దేశం మొత్తం నుంచి 32 మంది ఈ అవార్డుకు ఎంపియ్యారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సమావేశమయ్యారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details