విశాఖలోని సూర్యబాగ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో ఈ కేంద్రం సేవలందించనుందని తెలిపారు. అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో సిబ్బంది అందిస్తున్న సేవల్ని హోంమంత్రి అభినందించారు. ఉత్తమ సేవలు అందించిన అగ్నిమాపక సిబ్బందిని సన్మానించారు. అగ్నిమాపకశాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
'అగ్నిమాపకశాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్' - హోం మంత్రి సుచరిత వార్తలు
అగ్నిమాపక శాఖలోని పోస్టుల భర్తీకి జనవరిలో ప్రకటన విడుదల చేస్తామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. ఈ శాఖలోని సిబ్బంది అందిస్తున్న సేవల్ని కొనియాడారు.
!['అగ్నిమాపకశాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్' sucharitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5459257-822-5459257-1577019382942.jpg)
మేకతోటి సుచరిత
అగ్నిమాపక శాఖలో పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామన్న హోంమంత్రి సుచరిత
ఇదీ చదవండి: