married woman dead: పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. దంపతులిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. ఆ నవ వధువు మాత్రం మృత్యుఒడికి చేరింది. ఈ విషాదకర సంఘటన విశాఖపట్నంలో జరిగింది.
married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి - అనుమానాస్పదస్థితిలో వధువు మృతి
Married woman Dead: విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులో ఓ మహిళ అనుమానాస్పద మృతిచెందింది. భర్తే ఆమెను హతమార్చాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
![married woman dead: పెళ్లై రెండు నెలలైనా కాలేదు.. వివాహిత అనుమానాస్పద మృతి dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13933865-thumbnail-3x2-m.jpg)
dead
విశాఖపట్నంలోని భీమిలి 4వ వార్డులోని గోవుపేటలో నర్సాయమ్మ (24) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. అయితే.. రాత్రివేళ భర్త హరి భార్యను చంపాడంటూ మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Honey Trap: 'వలపు వలతో దోచుకుంటున్నారు.. బాధితులు భయంతో ఆగిపోతున్నారు'