ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖలో తొలిసారి మిలన్-2020 - naval exercise news latest vishaka

విశాఖలో 2020 మార్చిలో జరిగే అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసం మిలన్-2020 నిర్వహణ ప్రణాళిక కోసం విశాఖలో మూడు రోజుల సదస్సు జరిగింది.

naval exercise milan 2020 in vishaka

By

Published : Nov 9, 2019, 8:02 PM IST

యుద్ధ నౌకల విన్యాసం మిలన్​-2020 నిర్వహణ కోసం తూర్పు నౌకాదళం ప్రధాన స్థావరంలో సన్నాహక సదస్సు జరిగింది. 17 దేశాల నౌకాదళాల నుంచి 29 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 2020లో విశాఖలో మిలన్ నిర్వహణ ఐఎఫ్​ఆర్ అనుభవంతో చేస్తామని కమాండర్ సంజయ్ ఇస్సార్ వెల్లడించారు. హార్బర్, సీ ఫేజ్​లపై వివరంగా చర్చించారు. 1995లో ఆరంభమైన మిలన్ విన్యాసాలు, ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతాయి. గతంలో అండమాన్ నికోబార్ దీవులకే పరిమితమైన ఈ మిలాన్ నిర్వహణ... తొలిసారి విశాఖలో నిర్వహించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక దేశాల నౌకాదళాల మధ్య వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు, పరస్పర సాంకేతిక మార్పిడి కోసం మిలన్ తోడ్పడుతుందని సదస్సులో అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details