ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫ్రంట్​లైన్ వారియర్​పై పోలీసుల దాడి సిగ్గుచేటు: లోకేశ్ - nara lokesh fiers on YCP govt

వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో విధులు ముగించుకుని ఇంటికెళ్తున్న అపోలో ఫార్మసీ ఉద్యోగినిపై పోలీసులు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. ఈ ఘటన జగన్ రెడ్డి పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు.

arrest of apollo pharmacy women employee in vizag
nara lokesh

By

Published : Jun 6, 2021, 4:48 PM IST

విశాఖ‌ ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుందో లేదో కానీ, వైకాపా మార్క్‌ పులివెందుల పోలీసింగ్‌తో అరాచ‌కాల‌కు అడ్డాగా మారిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్​గా ప‌నిచేస్తున్న అపోలో ఫార్మసీ ఉద్యోగిని ల‌క్ష్మీ ప్రస‌న్నపై పోలీసులు దాడి చేయటం సిగ్గుచేటన్నారు. న‌డిరోడ్డుపై అంతా చూస్తుండ‌గానే ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ పై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించటం.. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచ‌క‌ పాలనకు నిద‌ర్శనమన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ను తన ట్విట్టర్ కు లోకేశ్ జత చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details