ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిండి రుబ్బే రాళ్లతో పరస్పర దాడి.. ఒకరి మృతి

విశాఖ నగరంలో ఒడిశాకి చెందిన యువకుడు హత్యకి గురయ్యాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పరస్పరం దాడి చేసుకోగా.. ఒకరు చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు. మరో యువకుడు అపస్మారక స్థితికి చేరుకున్నట్టు తెలిపారు.

By

Published : May 5, 2020, 6:19 PM IST

vishaka district
పిండి రుబ్బే రాళ్లతో కొట్టుకున్నారు.. ఒకరు తనువు చలించారు

విశాఖలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇసుకతోట రామాలయం వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడిని ఒడిషాకు చెందిన దేవరాజ్ నాయక్ గా గుర్తించారు. పిండి రుబ్బే గ్రైండర్ లో ఉండే... రాళ్లతో దేవరాజ్ పై దాడి జరిగినట్టు ఘటనా స్థలంలో ఉన్న దృశ్యం ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇదీ జరిగింది...

కొద్ది నెలల క్రితం ఒడిషాలోని ఒకే కుటుంబానికి చెందిన దేవారాజ్ నాయక్, గిరి అనే యువకులు స్థానిక కింగ్స్ రెస్టారెంట్ లో టీ మాస్టర్లుగా పనిచేసేందుకు వచ్చారు. వీరిద్దరి మధ్య నిన్న రాత్రి గొడవ జరగడంతో... ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరచుకున్నారు. ఈ ఘర్షణలో దేవరాజ్ నాయక్ చనిపోగా గిరి అపస్మారక స్థితికి వెళ్ళిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న గిరిని ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు తెలిపారు.

ఇదీ చదవండి:

దారుణం: పిండి రుబ్బే రాళ్లతో మోది చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details