రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్లకు కరోనా సోకింది. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇరువురూ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలియజేశారు. తనను కలిసేందుకు ఎవరు రావద్దని మంత్రి కోరారు. తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ - మంత్రి అవంతి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్
రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ రావడం వల్ల... వారు హోంక్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
![మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8802178-57-8802178-1600102456182.jpg)
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్