ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 14, 2020, 10:32 PM IST

ETV Bharat / city

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్

రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ రావడం వల్ల... వారు హోంక్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్​లకు కరోనా సోకింది. కరోనా నిర్ధరణ పరీక్షల్లో ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇరువురూ హోమ్ క్వారంటైన్​లోకి వెళ్లారు. ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి తెలియజేశారు. తనను కలిసేందుకు ఎవరు రావద్దని మంత్రి కోరారు. తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా వారిని ఫోన్​లో సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details